calender_icon.png 25 October, 2024 | 5:52 AM

భార్య గొంతుకోసి, తాను గొంతుకోసుకున్న భర్త

15-07-2024 03:56:21 PM

ఆదిలాబాద్, (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో  విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో భార్య భర్తల మధ్య గోడవ కత్తితో దాడి ఘటనకు దారి తీసింది. మండలంలోని సైద్ పూర్ లో సోమవారం కత్తితో భార్య సునీత కొంతుకోసిన భర్త ఏల్చల లస్మన్న అనంతరం అదే కత్తితో ఆయన కొంతుకోసుకున్నాడు. కాగా భార్య అక్కడికక్కడే చనిపోగా, భర్త ప్రాణాలతో కొట్టుమిట్టడుతున్నాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సంఘటనపై విచారణ చేపడుతున్నారు.