20-02-2025 11:03:45 AM
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో భార్య గొడ్డలితో నరికి చంపిన సంఘటన గురువారం వెకువ జామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండల పరిధిలోని తుర్క వడగం గ్రామానికి చెందిన హెబల్లె గుండప్ప తన భార్య అయిన చంద్రమను ఇంట్లోనే గొడ్డలితో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు కంగ్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై విజయ్ కుమార్ సంఘటనపై వివరాలను సేకరించారు. హత్యకు పాల్పడ్డ భర్తను అరెస్టు చేసి కంగ్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.