calender_icon.png 23 September, 2024 | 7:53 PM

కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త

23-09-2024 05:12:17 PM

కామారెడ్డి, (విజయక్రాంతి): భార్యాభర్తలు తోడు ఉంటామని ఏడాడుగులు బంధం ఒకటైన అనుమానం పెనుభూతమై భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త వైనం కామారెడ్డిలో వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న గంగాధర్ గౌడ్  కు 10 సంవత్సరాల క్రితం నిజాంబాద్ కు చెందిన రాజేశ్వర్గౌడ్ తన కుమార్తె రంగ రాణిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో కర్ణ కానుకలు సమర్పించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేశ్వర్ గౌడ్ గత మూడు సంవత్సరాల నుంచి తన కూతురుపై అనుమానం పెంచుకొని చిత్రహింసల గురి చేస్తూ ఇబ్బందుల పాలు చేశాడన్నారు.

గత 20 రోజుల నుంచి ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురి చేయడంతో ఐదు రోజుల క్రితం తమ కుమార్తె రాణి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపారు.  రాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తమ అల్లుడు గంగాధర్ గౌడ్ ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో ఐదు రోజుల క్రితం వచ్చి రానిని కామారెడ్డి లో ప్రథమ చికిత్స చేయించి హైదరాబాద్ కు మెరుగైన చికిత్స కోసం తరలించినట్లు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిందని రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. తమ అల్లుడు వేధింపుల వల్లనే తమ కూతురు ఆత్మహత్యానికి పాల్పడిందని తమ అల్లుడిపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి పట్టణ పోలీసులకు గంగాధర్ గౌడ్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని ప్రస్తుతం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.