సిరిసిల్ల లో విషాదం
రాజన్న సిరిసిల్ల, (విజయక్రాంతి): కుటుంబకలహాలతో భార్యను చంపి అనంతరం భర్త రాజేశం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ లో దూస రాజేశం (54) అనే వ్యక్తి తన భార్య లక్ష్మి (50)ని బెడ్ రూంలో బలమైన ఆయుధంతో మొహంపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం రాజేశం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేశం గత కొద్ది సంవత్సరాలుగా రెండు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. మృతులిద్దరికీ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ, పెద్ద కొడుకు వేణు, మౌనిక వివాహం కాగా బిటెక్ చదువుతున్న చిన్న కొడుకు వెంకటేష్ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.