- గంట తరువాత కొడుకు జననం
- గద్వాల జిల్లా రాజోళిలో విషాదం
అలంపూర్, అక్టోబర్ 23: పుట్టబోయే బిడ్డపై దంపతులు కోటి ఆశలను పెట్టుకున్నారు. ఇక జీవితాంతం ఆనందంగా సాగిపో తుందన్న కలలుగన్నారు. కాగా, బైక్ ప్రమాదంలో భర్త మృతిచెందగా, గంట తరువాత ఆ మహిళకు కొడుకు జన్మించాడు. ఈ విషా ద ఘటన గద్వాల జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది.
రాజోలి మండలం తుమ్మల్లపల్లికి చెందిన కురువ శివ (28)కు ఏడాది క్రితం ఏపీలోని బేతంచర్లకు చెందిన లక్ష్మితో వివాహమైంది. కుటుంబ పోషణ నిమిత్తం శివ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. అతని భార్య లక్ష్మి నిండు గర్భిణిగా కావడంతో కాన్పు నిమిత్తం తల్లిగారింటికి వెళ్లింది. మంగళవారం లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అదే రోజు రాత్రి శివ తన బైక్పై వెళ్తుండగా రాజోళి సమీపం లో బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి ఒంటి గంటకు శివ మృతి చెందాడు. మరోవైపు శివ భార్య అర్థరాత్రి రెండు గంటల సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చింది.
భర్త చనిపోయిన విషయాన్ని లక్ష్మికి చెబితే ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పలేదు. శివ మృతదేహాన్ని రాజోలికి తరలించి ఆమెకు తెలియ కుండానే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కొడుకు పుట్టాడన్న ఆనందంలో తల్లి ఉండగా భర్త మర ణించాడన్న వార్త చెప్పకుండా కుటుంబ సభ్యులు తమలో తాము కుమిలిపోతున్నా రు. మృతుడి తండ్రి పెద్ద మద్దిలెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.