calender_icon.png 14 October, 2024 | 2:14 AM

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

14-10-2024 12:20:20 AM

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): భార్య మందలించిందని భర్త ఆత్మహత్యకు పా ల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో జరిగింది. ముత్యాలంపాడు గ్రామానికి చెందిన ఊకె వెంకటకృష్ణ(30) మ ద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడంలేదు. ఈ విషయమై శనివారం భార్య జాన్సీరాణి భర్తను మందలింది. దీంతో ఇంటి నుంచి వెళ్లిన వెంకటకృష్ణ శనివారం రాత్రి తన పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ములకలపల్లి ఎస్సై రాజశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.