హైదరాబాద్: హైదరాబాద్ పబ్లిక్ ఆస్తులను కాపాడటం, స్థానిక సరస్సుల కోసం విపత్తు ప్రతిస్పందన నిర్వహణ బాధ్యత కలిగిన హైడ్రా ఏజెన్సీ ఏర్పాటు చేసి నేటికి వంద రోజులు అవుతోంది. జూలైలో ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పడింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19న GO 99తో ఏర్పడిన హైడ్రా జులై 26 నుంచి కూల్చివేతలు మొదలు పెట్టింది. ఇప్పటివరకు 30 ప్రాంతాల్లో 300 అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసి 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది.
సరస్సు సరిహద్దులు, బఫర్ జోన్లను ఆక్రమించిన నిర్మాణాలను కూల్చివేయడం ద్వారా హైడ్రా నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ చర్యలు అనధికార నిర్మాణాల నుండి నీటి వనరులు, ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలను రక్షించడానికి ఆక్రమణలను హైడ్రా అరికట్టి ప్రజల మన్ననలు పొందింది. హైడ్రా కూల్చివేతలపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.