01-03-2025 12:48:47 AM
టైలర్స్ డే సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి మేరు సంఘం ప్రతినిధులు డిమాండ్
బాన్స్ వాడ, ఫిబ్రవరి 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఫిబ్రవరి 28 న టైలర్స్ డే సందర్భంగా బాన్సువాడ మేరు సంఘం ఆధ్వర్యంలో. సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారి డి ఏ ఓ. పడాల విజయ్ కుమార్. శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేరు సంఘం అధ్యక్షులు హనుమాన్లు మాట్లాడుతూ.మేరు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 50 సంవత్సరాలు నిండిన వారికి 3 వేల నెలసరి పింఛన్ సౌకర్యం కల్పించాలని.
మే రు వృత్తి దర్జీ కార్మికులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించాలి. మేరు కులవృత్తి చేసుకునే వారికి అధునాతమైన యంత్రాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. టైలరింగ్ జూటు బ్యాగుల తయారీపై ఉచిత శిక్షణ ఇప్పించి గుర్తింపు కార్డు సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు. మేరు కులవృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయలు వరకు రుణం నేరుగా ఇప్పించి 80 శాతం సబ్సిడీతో ఉపాధి కల్పించాలని అన్నారు.
మేరు కులవృత్తి చేసుకునే వారికి పని కల్పించుటకు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్, తదితర ప్రభుత్వ శాఖల వారి యూనిఫాం కుట్టించే పనిని స్థానిక మేరు కులస్తుల సంఘాల వారికి మాత్రమే కల్పించాలని.మేరు ఫెడరేషన్ ఏర్పాటు చేసి తక్షణమే 100 కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మేరు సంఘం అధ్యక్షుడు విటూ రి హనుమాన్లు. ఉపాధ్యక్షుడు పెండ్యాల భాస్కర్.కొట్టురి మహేష్.అంబిక సురేష్.మా జీ అధ్యక్షులు కొత్తకొండ దేవదాస్.మండల కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్. జిల్లా ఉపాధ్యక్షులు శీలం కోటి మహేష్. కార్యవర్గ సభ్యులు శిలామికోటి నందు కుమార్. శీలం కోటి సంతోష్. కోనాపూర్ వెంకటి. గంగాధర్. తదితరులు పాల్గొన్నారు.