calender_icon.png 30 September, 2024 | 7:45 PM

కొమరవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

30-09-2024 05:50:56 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): చేర్యాల నియోజకవర్గం కొమురవెల్లి మండల కేంద్రంలో సోమవారం రోజున, కొమురవెల్లి మల్లన్న ఆలయ కార్య నిర్వాణ అధికారి  బాలాజీ ఆధ్వర్యంలో శ్రీ కొమురవెల్లి మల్లన్న  ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. 76 రోజుల హుండీ ఆదాయం లెక్కింపు, మిశ్రమ బంగారం  51గ్రాములు, మిశ్రమ వెండి  05కి లోల 050గ్రాములు, విదేశీ కరెన్సీ 25 ఎన్ ఒ ఎస్, మిశ్రమ బియ్యం 06 కింటలు, నగదు 63 లక్ష్యల 66 వేల 933 రూపాయలు సమాకూరింది. ఈ కార్యక్రమంలో, ఏఈఓ బాలాజీ, ఎం చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్, మెదక్ జిల్లా ప్రధాన అర్చకులు, మల్లికార్జున్, ఆలయ కార్య నిర్వహణ అధికారి బుద్ధి శ్రీనివాస్, ఏపీజీబీ బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు