calender_icon.png 5 October, 2024 | 6:56 AM

మానవత్వం చాటుకున్న ఎంఈవో

05-10-2024 02:01:11 AM

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎంఈవో ఎం ప్రభుదయాల్ మానవత్వాన్ని చాటుకున్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. ఈ క్రమంలో గుండాల మండలానికి చెందిన అభ్యర్థి ఈసం విజయనిర్మల డెంగ్యూతో బాధపడుతూనే బంధువుల సాయంతో సర్టిఫి కెట్ల పరిశీలనకు కేంద్రానికి శుక్రవా రం వచ్చింది. ఆమె పరిస్థితిని గమనించిన ఎంఈవో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక సదుపాయాలు కల్పించి సర్టిఫికెట్ల పరిశీలన చేశారు.