calender_icon.png 24 October, 2024 | 2:18 AM

సింగీతం ప్రాజెక్టులోకి భారీ ఇన్ ఫ్లో

07-08-2024 12:20:59 PM

వరద గేటు ద్వారా నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అనుసంధానంగా నిర్మించిన  సింగీతం ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి భారీ ఇన్ ఫ్లో ప్రవహిస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 416.550 మీటర్ల పూర్తిస్థాయి నీటితో నిండి ఉండగా ఎగువ భాగం నుంచి 475 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా ప్రవహిస్తుండడంతో ఒక వరద గేటు ద్వారా నీటిని ప్రధాన కాలు ఆయకట్టుకు మళ్ళిస్తున్నట్లు ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ఇక నిజాంసాగర్ ప్రాజెక్టు నిలకడగా ఉంది. ఎలాంటి ఇన్ ఫ్లో లేకపోవడంతో ప్రస్తుతం 1405.00 అడుగులు 17.80 టిఎంసి లకు గాను 1389.55అడుగులు 3.86టిఎంసి నీరు నిలువ ఉన్నదని అధికారులు వెల్లడించారు.