calender_icon.png 6 October, 2024 | 7:05 PM

భోపాల్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

06-10-2024 04:50:31 PM

మధ్యప్రదేశ్,(విజయక్రాంతి): రాజధాని నగరం భోపాల్ లో పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టివేత కలకలం సృష్టించింది. భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో మాదకద్రవ్యాలు తయారు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో గుజరాత్ ఏటీఎస్, ఢిల్లీకి చెందిన ఎన్సీబీ ఆపరేషన్ నిర్వహించి 1800 కోట్ల విలువైన ఏండీ డ్రగ్స్ ను మధ్యప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. ఫ్యాక్టరీలో మరింత ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోని అరెస్టు చేసినట్లు గుజరాత్ హోంశాఖ సహాయక మంత్రి హర్ష సంఘవి 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.