నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
వివిధ విభాగాల అధికారులతో సీపీ సుధీర్బాబు సమన్వయ సమావేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు అన్నా రు. నేరెడ్మెట్లోని తన కార్యాలయంలో గురువారం వివిధ విభాగాల అధికారులు, భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులు శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వద్దని సూచించారు.
ఉత్సవ నిర్వాహకుల సౌలభ్యం కోసం రాచకొండ పోలీసు వెబ్సైట్ ‘https:// policeportal.tspolice.gov.in/index.htm’ అందుబాటులో ఉం టుందన్నారు. ఉత్సవాల నిర్వహణ, భద్రతకు సంబం ధించి రాచకొండ పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ, అగ్నిమాపకశాఖ, నీటి పారుదలశాఖ, వైద్య, విద్యుత్, రవాణా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంతకేశవ్ పాటిల్, డీసీపీలు ప్రవీణ్కుమార్, బి.కరుణాకర్, అరవింద్బాబు, మురళీధర్, శ్రీనివాస్, సునీతరెడ్డి పాల్గొన్నారు.