27-02-2025 02:06:06 AM
మహమ్మదాబాద్, ఫిబ్రవరి 26 : బాల బాలికలకు బంగారు భవిష్యత్తు అందించాలని సంకల్పంతోపాటు నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ కల్పన జరుగుతుందనే ఆశయంతో ప్రభుత్వము నాటి నుంచి ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో ఆయా ప్రాంతాల్లో ఉంటు న్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించడంతోపాటు వారి ఉపాధి పొందాలని గొప్ప ఆశయంతో ఏర్పాటు కు సహకరించిన ప్రభుత్వం నిబంధనలను కొందరు గండి కొడుతుండ్రు.
ప్రైవేట్ పాఠశాలల్లో మీ బిడ్డలను చేర్పించండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలా తీర్చిదిద్దుతామంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లను ప్రచారం చేసుకుం టూ అనుమతులు లేకుండానే పాఠశాలలను నిర్వహిస్తున్నారు. నిబంధనలను పాటి స్తూ విలువలతో కూడిన విద్య నేర్పిస్తూ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాలని ప్రజా సంఘాల నాయకులు కోరు తుండ్రు.
కాగా కొందరు మాత్రం తక్కువ తరగతులకు అనుమతులు పొంది పై తరగతులు చదువుతున్న విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తూ ఇటు విద్యార్థులను అటు వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తుండ్రు. నిబంధనల మేరకు అనుమతులు తీసుకొని విద్యా బోధన చేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.
షోకాజ్ నోటీసు..
మహమ్మదాబాద్ మండల కేంద్రంలో నేషనల్ హైవే 167 పక్కన ఉన్న న్యూ బ్రిలియంట్ పాఠశాల కు రాబోయే విద్యా సంవత్సరము మూసివేయండి అంటూ రాష్ర్ట విద్యాశాఖ అధికారులు షోకాజ్ నోటీసులను జారీ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు సైతం అడ్మిషన్లు ఇవ్వడం జరిగిందని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అనుమతి లేకుండా పై స్థాయి తరగతులు కు ఎలా అడ్మిషన్ ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అనుమతులు ఇవ్వడం లేదంటూ డీఈఓకు ఫిర్యాదు..
మహమ్మద్ బాద్ మండల కేంద్రంలోని న్యూ బ్రిలియంట్ పాఠశాలకు పై తరగతులు చదువుకునేందుకు అనుమతి ఇవ్వడం లేద ని ఏమియు రాజు నాయక్ పై డిఈఓ కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. 8, 9, 10 తరగతులకు అనుమతులు ఇవ్వడంలో ఎంఈఓ డబ్బు లు అడుగుతున్నారని వారి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో పాఠశాల ప్రిన్సిపల్ దేవేందర్, గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి భరత్, ప్రశాంత్, వంశీ, ఆది విష్ణు ఉన్నారు.