హరీశ్రావును ప్రశ్నించిన మెట్టు సాయికుమార్
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): పదేండ్లలో ఎన్ని చేప పిల్లలను వదిలారో లెక్క ఎందుకు చెప్పడం లేదని మాజీ మంత్రి హరీశ్రావును ఫిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రశ్నిం చారు. గురువారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. మల్లన్నసాగర్లో ఎన్ని చేప పిల్లలు వదిలారో చెప్పాలని డిమాండ్ చేవారు. కాంట్రాక్టర్లను పెంచి పోషించిందే హరీశ్రావు అని, తమపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తలసాని, హరీశ్రావు మత్స్యశాఖలో కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు.