calender_icon.png 24 October, 2024 | 9:57 AM

ఉరి వేసుకుని గృహిణి ఆత్మహత్య

24-10-2024 01:28:49 AM

నిర్మల్, అక్టోబర్ 23,(విజయక్రాం తి): అనారోగ్య సమస్యలతో నిర్మల్ పట్టణంలో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ ఎస్సై తెలిపిన ప్రకారం గాజులపేటలో ఉజుమా(31)అనే మహిళ తన భర్త, ముగ్గు రు పిల్లలతో కలిసి నివాసముంటున్న ది. భర్త ఆర్టీసీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆమె కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్నది.

భర్త డ్యూటీ కి వెళ్లిన తరువాత మంగళవారం రాత్రి ఇంట్లోనే ఫ్యానుకు చున్నీ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధ వారం  పోలీసులు సంఘటనా స్థలాని కి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.