హైదరాబాద్,(విజయక్రాంతి): మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలు మొదలయ్యాయి. మలక్ పేట పరిధిలోని శంకర్ నగర్ లో తొలి ప్రక్రియలో భాగంగా రివర్ బెట్ లో వీధులు ఇరుకుగా ఉండడంతో కూలీల సహాయంతో అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేతలను ప్రారంభించారు. ఆర్బీ-ఎక్స్ లో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన సిమెంట్, రేకుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక్కడ దాదాపు 140 ఇళ్లు ఖాళీ చేసిన నిర్వాసితుల సామగ్రి తరలింపునకు వాహనాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్నారు. శంకర్ నగర్ లో బాధిత కుటుంబాలు అధికారుతో వాగ్వాదానికి దిగ్గారు. ఇళ్లలో ఉన్న సామగ్రిని తొలగించేందుకు కొంత సమయం ఇవ్వాలన్ని కోరారు.