calender_icon.png 3 October, 2024 | 8:36 PM

ఇంటింటి కుటుంబ సర్వే పక్కగా నిర్వహించాలి

03-10-2024 06:43:13 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఇంటింటి కుటుంబ సర్వే పక్కగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో కుటుంబ సర్వే పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేని పగడ్బందీగా పూర్తి సమాచారంతో నిర్వహించాలన్నారు. జిల్లాలోని మున్సిపల్ గ్రామాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలలో సర్వే పనులు టీమ్ల ద్వారా ఈనెల 7 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వే బృందాలకు కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. తరంపల్లి గ్రామంలో నిట్టు గంగాధర్ కుటుంబం సర్వేలో పాల్గొని సర్వే పత్రాన్ని కలెక్టర్ గంగాధర్ రావుకు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, వార్డ్ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్, స్థానికులు పాల్గొన్నారు.