సివిల్ సప్లు అధికారుల దాడులు
20 గ్యాస్ సిలిండర్ల సాధీనం
ఆదిలాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): హోటళ్లు, రెస్టారెంట్లలో గృహవినియోగ సిలిండర్లు వినియోగిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిరహించారు. వాణిజ్య సిలెండర్లకు బదులు వినియోగిస్తున్న ౨౦ గృహ వినియోగ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. రెండో సారి రాయితీ సిలెండర్లు వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల అధికారి వాజిద్ అలీ పేర్కొన్నారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బాబుసింగ్, ప్రేమ్నివాస్, రామారావు, నారాయణ, మధుసూదన్, విశనాథ్, రవీందర్ పాల్గొన్నారు.