05-03-2025 06:40:17 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ మండలంలోని గ్రామాల్లో ఇంటి పన్ను తప్పనిసరిగా చెల్లించాలని ఎంపీఓ సిహెచ్ రత్నాకర్ రావు కోరారు. మండలంలో ఇంతవరకు 80 శాతం ఇంటి పన్ను వసూలు చేశామని, కొంతమంది ఇంటి యజమానులు వెంటనే పను చెల్లించి, అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన గ్రామపంచాయతీలను తనిఖీ చేశారు.