25-03-2025 08:48:18 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఇటీవల జిల్లా కేంద్రంలో కుమ్రం భీం జాతీయ అవార్డుల ప్రధానోత్సవం విజయవంతం కావడంలో అందులో భాగస్వాములైన పలువురిని మంగళవారం దర్శక, నిర్మాత నాగబాల సురేష్ కుమార్ సన్మానించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి వై సంపత్ కుమార్ తో పాటు పలు అధికారులను శాలువతో సన్మానించారు. అవార్డు ప్రధానోత్సవం జయప్రదం కావడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట రాధాకృష్ణ చారి ఉన్నారు.