calender_icon.png 8 October, 2024 | 10:18 PM

నిజాయతీ చాటుకున్న గంగపుత్రులు

08-10-2024 12:19:07 AM

నిర్మల్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర గోదా వరి పుష్కర ఘాట్ వద్ద దొరికిన బ్యాగును బాధితురాలికి అప్పగించి నిజాయతీ చాటుకున్నారు గంగపుత్రులు. నిజామాబాద్ జిల్లా రెంజర్ల కు చెందిన లక్ష్మి అనే భక్తురాలు పుష్కరఘాట్ వద్ద సోమవారం తన బ్యాగును మరిచిపోయి వెళ్లింది. అక్కడే ఉన్న గంగాపుత్ర సంఘం సభ్యులకు దొరకగా వారు బాధితురాలికి అప్పగించారు. బ్యాగులో రూ.40 వేల విలువ చేసే ఫోన్లు, కొంత నగదు ఉన్నది. గంగపుత్ర స భ్యులను భక్తులు అభినందించారు.