న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు వచ్చే నెలలో జర్మనీతో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 23, 24 తేదీల్లో న్యూఢిల్లీలోని ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. పారిస్లో ఒలింపిక్స్ సెమీస్లో భారత్ జర్మనీతో తలపడింది. ఆ మ్యాచ్లో ఓటమిపాలైన హర్మన్ సేన జర్మనీ మీద ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. ఇటీవలే ఆసియా చాంపి యన్స్ ట్రోఫీలో భారత్ ఐదోసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.