11-12-2024 02:17:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (విజయక్రాంతి): పర్యావరణ అనుకూలమైన ఆహార ఉత్పత్తుల్లో అగ్రగామిగా నిలిచిన హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఏఎల్ రయాన్ ఎగ్జ్పోర్ట్తో స్లాటరింగ్, చిల్లింగ్, ప్రాసెసింగ్, ఫ్రీజింగ్, ప్యాకింగ్ కోసం ఫెసిలిటీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గతంలో మలేషియాకు చెందిన సెలాంగర్ వ్యవసాయ అభివృద్ధి సంస్థ (పీకేపీఎస్)తో హెచ్ఎంఏ ఆగ్రో ఎంఓయూ కుదుర్చుకున్నది. ఈ ఒప్పందాన్ని ఆ దేశంలోని సెలాంగర్ రాష్ర్ట ముఖ్యమంత్రి సమక్షంలో చేసుకున్నారు. 63 ఏళ్ల అనుభవం కలిగిన హెచ్ఎంఏ 60 దేశాల్లో సేవలు అందిస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
అగ్రో ఇండస్ట్రీస్ రోజుకు 1,472 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆగ్రా, అలీగఢ్, మేవట్, ప్రాభణి వంటి ఆరు నగరాల్లో అత్యాధునిక తయారీ కేంద్రాలను కలిగి ఉన్నదన్నారు. ఈ భాగస్వామ్యాల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో హెచ్ఎంఏ స్థానాన్ని మరింత బలపర చుకొని, దీర్ఘకాలిక ప్రగతి సాధించేందుకు దోహదపడుతుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.