calender_icon.png 26 October, 2024 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేయాలి

22-07-2024 01:51:34 AM

టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి, జూలై 21 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని, బీ.ఎడ్ పూర్తి చేసిన ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి  ఎం రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం భువనగిరిలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు సంగు వనిత అధ్యక్షతన నిర్వ హించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పదోన్నతు ల కారణంగా ఖాళీగా ఉండే పోస్టుల్లో అర్హులను వెంటనే నియమించాలని కోరారు. అంగన్‌వాడీల్లో మూడో తరగతి వరకు బోధనను వెంటనే విరమించుకోవాలని డిమాం డ్ చేశారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్క్ అడ్మినిస్ట్రేషన్ పేరిట నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన డిప్యుటేషన్స్ రద్దు చేయాలని అన్నారు. యాకయ్య, మెతుకు సైదులు, ముక్కెర్ల యాదయ్య,  వెంకటరెడ్డి, సుధ ధర్మారెడ్డి, రవికుమార్, రమణారావు, కరుణాకర్ పాల్గొన్నారు.