వ్యక్తి దుర్మరణం
రాజేంద్రనగర్, సెప్టెంబర్29: రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు.. కాటేదాన్కు చెందిన మధు సూదన్రెడ్డి ఆదివారం రాజేంద్రనగర్లోని పత్తికుంట నుంచి బైక్పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.