calender_icon.png 1 October, 2024 | 4:56 PM

ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు

30-09-2024 12:27:09 AM

తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు, నటుడు ప్రకాశ్‌రాజ్‌ల మధ్య ఎక్స్ వేదికగా తీవ్ర సంభాషణ జరిగింది. దీనిపై మంచు విష్ణు తాజాగా స్పందించారు. తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకే తాను పోస్ట్ పెట్టానని.. అందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదని మీడియాతో చెప్పారు.

ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌ను ఉద్దేశించి.. “అది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా నా అభిప్రాయాన్ని నేనూ తెలియజేశా. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా ఆ వివాదానికి మతం రంగు లేదని గర్వంగా చెప్పలగలను. ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని తెలియజేశా.

నాన్న నటించిన చాలా సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు. ఎంతోకాలం నుంచి ఆయన తెలుసు. నేను అంకుల్ అని పిలుస్తుంటా. ఆయన అంటే గౌరవం ఉంది. ఎలాంటి కాంట్రవర్సీ లేదు” అని విష్ణు తెలిపారు.