calender_icon.png 23 October, 2024 | 8:52 AM

వ్యవసాయంలో హిందుస్థాన్ యునీలివర్ పెట్టుబడి

23-10-2024 02:38:56 AM

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఆహార, ఆహారేతర రంగంలో పేరొందిన హిందుస్థాన్ యునీలివర్ లిమిటెడ్ కంపెనీకి చెందిన గ్లోబల్ ప్రొక్యూర్ మెంట్ మేనేజర్ ట్రొఫికర్ మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును కలిశారు. తెలంగాణలో ఆయిల్ పామ్, వ్యవసాయ, ఆహార పరిశ్రమ రంగంలో పెట్టుబడులకు పెట్టడానికి తమ కంపెనీ సిద్ధంగా ఉందని, అందుకు అవకాశాలు కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన తుమ్మల ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయం సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.