calender_icon.png 19 October, 2024 | 7:08 PM

సచివాలయం వద్ద ఉద్రిక్తత

19-10-2024 04:11:04 PM

హైదరాబాద్: తెలంగాణ అంబేద్కర్ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయం వద్ద గ్రూప్ వన్ అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు  గ్రూప్ వన్ అభ్యర్థులకు మద్దతుగా సచివాలయానికి చేరుకున్నారు. జీవో 29ని రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సచివాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. అటు సచివాలయం వద్ద ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన కారులను పోలీసులు వాహనాల్లోకి ఎక్కించారు. అభ్యర్థులతో పాటు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు.