హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాం తి): హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద 100 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడానికి అనుమతి మంజూరు చేయా లంటూ ఏసీపీకి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద శుక్రవారం బతుకమ్మ వేడుకల నిర్వహణకు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి 100 మంది మహిళలతో బతుక మ్మ వేడుక నిర్వహించుకోవ డానికి అనుమతించాలని పోలీసులను ఆదేశించారు. ఇం దులో డీజే సౌండ్ సిస్టంలు వినియోగించరాదని స్పష్టంచేశారు. వేడుకల్లో పాల్గొనేవారు రాజకీయ ప్రసంగాలు చేయరాదన్నది.