హైదరాబాద్ : కేంద్రమంత్రి బండి సంజయ్ పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం సమర్పించారని పిటిషన్ వేశారు.
ఎన్నికల సమయంలో గంగుల కమలాకర్ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చు పెట్టారని పిటిషన్ వేసిన బండి సంజయ్ ఇప్పటివరకు అడ్వకేట్ కమిషన్ ముందు సాక్ష్యం ఇవ్వలేదని ధర్మాసనం సీరియస్ అయింది. కేంద్రమంత్రిగా అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని బండి సంజయ్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను జూలై 26వ తేదీకి వాయిదా వేసింది.