హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో గ్రూప్-1 మెయిన్స్ కు లైన్ క్లియర్ అయింది. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ప్రాథమిక కీలో తప్పులున్నాయనే పిటిషన్ పై డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
ఇప్పటికే గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 అభ్యర్థుల తరపున అడ్వకేట్ మోహిత్రావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తమ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని చీఫ్ జస్టిస్ కోర్టులో స్పెషల్ మోషన్ వేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ గ్రూప్ 1 కేసు పిటిషన్ను సోమవారం విచరాణ చేపడుతామని తెలిపారు.