calender_icon.png 29 September, 2024 | 10:58 AM

ఎఫ్‌ఐహెచ్ అవార్డు రేసులో హర్మన్

22-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ప్రతిష్ఠాత్మక ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) శనివారం ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 8 మ్యాచ్‌ల్లో 10 గోల్స్ చేసిన హర్మన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గతంలో రెండుసార్లు హర్మన్ ఎఫ్‌ఐహెచ్ అవార్డు గెలు చుకోవడం విశేషం. హర్మన్‌ప్రీత్‌తో పాటు నెదర్లాండ్స్ ఆటగాళ్లు థియెర్రీ బ్రింక్‌మన్, జోప్ డీ మోల్, హన్నెస్ ముల్లర్ (జర్మనీ), జాక్ వల్లకె (ఇంగ్లండ్) అవార్డు రేసులో ఉన్నారు. 2024లో జరిగిన అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లతో పాటు హాకీ టెస్టు సిరీస్, ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రో లీగ్, ఎఫ్‌ఐహెచ్ హాకీ నేషన్స్ కప్, ఐఎఫ్‌హెచ్ హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్, ఒలింపిక్స్‌లో సదరు ఆటగాళ్ల ప్రద ర్శనను పరిగణలోకి తీసుకొని అవార్డుకు ఎంపిక చేయనుంది. అక్టోబర్ 11 వరకు నా మినేషన్స్ ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.