calender_icon.png 26 October, 2024 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ సమావేశానికి చైర్‌పర్సన్ స్థానంలో ఆమె భర్త హాజరు

30-08-2024 12:34:19 AM

సదాశివపేటలో వెలుగు చూసిన ఘటన

సంగారెడ్డి, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఆయన ఒక సాధారణ పౌరుడు. తన భార్య మాత్రం మున్సిపల్ చైర్‌పర్సన్. కానీ ఆయన తాను ఏ హోదాలో ఉన్నాడనుకున్నాడో తెలియదు గానీ మున్సిపల్ అధికారులు నిర్వహిం చిన అధికారిక సమావేశానికి భార్య స్థానంలో హాజరయ్యాడు. అంతేకాదు అనధికారిక అతిథి చైర్‌పర్సన్ సీటులో ఆశీనుడయ్యాడు. ఈ దృశ్యం గురువారం సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాల సమావే శంలో కనిపించింది. ఆ సమావేశానికి మున్సిపల్ చైర్‌పర్సన్ అపర్ణ హాజరుకాకుండా, ఆమె భర్త శివరాజ్ పాటిల్ హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివరాజ్ పాటిల్ ఏ హోదాలో మున్సిపల్ సమావేశంలో కూర్చుంటారని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు.