27-03-2025 12:00:00 AM
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని కలిసిన హెచ్సీయూ ఐక్య కార్యాచరణ కమిటీ
శేరిలింగంపల్లి, మార్చి 26(విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీ భూముల పరిరక్షణకు,తాము చేస్తు న్న పోరాటానికి తమకు మద్దతు తెలియజేసి భూములను రక్షించేందుకు సహాకారం అందించాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీని విద్యార్థులు కోరారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. యూనివర్శీటీకి చెందిన భూము లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే అక్కడి వైవిధ్యమైన జీవవైవిధ్యం వృక్షజాలం నశించి, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఇప్పటికీ యూనివర్శీటీ భూములను యూనివర్శీటీకి చెందినవిగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ చేయించలేదని వారికి చెందిన భూములను వారికే అప్పజెప్పాలని కోరారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం భారత్ స్పోరట్స్ సంస్థకు కేటాయించిన 400 ఎకరాలు గత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని అదే కాంగ్రెస్ మళ్ళీ విక్రయించాలని చూస్తోందని అన్నా రు. విద్యార్థుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని అఖిల భారత స్థాయిలో తమ పార్టీ ఎం.పి.లతో కేంద్ర మంత్రుల దృష్టికి ఈ సమస్యను తీసుకుని వెళ్తామని తెలిపారు. విద్యార్థులు తమ పోరాటాన్ని భవిష్య త్ తరాలకు ఈ భూములు దక్కెందుకు పోరాటాన్ని కోనసాగించాలని అన్నారు.