calender_icon.png 24 October, 2024 | 4:57 AM

వయనాడ్ బాధితులకు సాయం

02-08-2024 12:05:00 AM

భారీ వర్షాల కారణంగా కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా తీవ్ర విధ్వంసమైన సంగతి తెలిసిందే. కొండచరియలు విరిగిపడిన ఘటనలో భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈ విపత్తు యావత్తు దేశాన్ని కలిచి వేసింది. ఈ నేపథ్యంలో వయనాడ్ బాధితుల సహాయార్థం సినీ నటులు సూర్య, జ్యోతిక, కార్తీ రూ.50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా తనవంతుగా రూ.10 లక్ష సహాయాన్ని అందజేసినట్టు సమాచారం.