నూతన ఎంఈఓగా హెలెన్ డారితి
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండల నూతన విద్యాధికారిగా హెలెన్ డారతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది పుష్పగుచ్చం అందించి స్వాగతం తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయులతో పలు విద్యా అభివృద్ధి విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంఇఓ హెలెన్ డారతి మాట్లాడుతూ... మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతతో విద్యా బోధన జరిగేలా, చర్యలు తీసుకుంటానని అన్నారు. అదేవిధంగా మండలంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని, విద్యార్థులలో పోషకాహార లోపాన్ని తగ్గించి, నాణ్యమైన ఆహారాన్ని వారికి అందేలా ప్రభుత్వం చేపడుతున్న మిడ్ డే మీల్స్ ను మెనూ ప్రకారం సక్రమంగా అందేలా చూస్తానని తెలిపారు.