calender_icon.png 21 September, 2024 | 1:08 PM

నిమజ్జనం కోసం తరలుతున్న గణనాథులు...

16-09-2024 12:27:10 PM

హైదరాబాద్: హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కోసం గణేష్ విగ్రహాలు భారీగా తరలి వస్తూ ఉండటంతో ట్యంక్ బండ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్, నాంపల్లి, ఆబిడ్స్లో  ఇలా పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. నిలిచిన ట్రాఫిక్ నేపథ్యంలో పావుగంట ప్రయాణానికి గంటలు పడుతూండటంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. వాహనాల దారిమళ్లింపును చేపడుతుండగా..ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపుతో వాహనదారుల ఇబ్బందులతో పాటు లక్డీకపూల్, ఖైరతాబాద్, ఆబిడ్స్ తదితర ప్రాంతాల ప్రజల జన జీవీతం స్థంబించిపోయందని పలువురు తెలిపారు.