calender_icon.png 27 October, 2024 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో భారీగా వర్షం...

01-09-2024 03:53:06 PM

తెలంగాణ-మహారాష్ట్రకు నిలిచిన రాకపోకలు..

నీట మునిగిన పంట పొలాలు... 

ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో గతరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, పలు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. జైనథ్ మండలంలోని ఆనంద్ పూర్ గ్రామ సమీపంలోని పెన్ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆనంద్ పూర్ గ్రామ వంతెనపై నుండి వరద నీరు ఉద్ధృతిగా ప్రవహించడంతో తెలంగాణ-మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయయి. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామం వద్ద వంతెన పై నుండి ఉధృతిగా ప్రవహిస్తున్న వాగు కాసేపు రాకపోకలు నిలిచిపోయయి. బేలా మండలంలోని సాంగిడి గ్రామం భారీ వర్షాలకు పత్తి పంట పొలాలు వరద నీట మునిగిపోయాయి.