calender_icon.png 18 October, 2024 | 1:40 PM

సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం అపహరణ

27-07-2024 03:04:22 PM

సత్వార్ : సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం అపహరణకు గురైంది. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద గుర్తు తెలియని దుండగులు ట్రావెల్స్ బస్సులో 4 కిలోల బంగారం చోరీ చేశారు. ఓ బంగారం వ్యాపారి హైదరాబాద్ నుంచి ముంబయికి బంగారం తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.  ఈ క్రమంలోనే శుక్రవారం అర్థరాత్రి ట్రావెల్స్ బస్సు భోజనం చేసేందుకు ఓ ధాబా వద్ద ఆగడంతో దుండగులు బస్సులోకి చోరబడి బంగారం దొంగిలించారు. బస్సు బయలుదేరే సమయంలో బాధితుడు బంగారం ఉన్న బ్యాగును చూసుకోగా అందులో బంగారం కనిపించలేదు. దీంతో బాధితుడు జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరకుని ధాబాలోని సీసీటీవీ కెమెరాలో చూడగా.. బంగారం చోరీ ఘటన దృశ్యాలు నమోదయ్యాయి. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.