calender_icon.png 3 October, 2024 | 5:55 AM

ఢిల్లీలో భారీగా పట్టుబడిన డ్రగ్స్

03-10-2024 02:57:18 AM

500 కిలోల కొకైన్ l మార్కెట్‌లో విలువ 2 వేల కోట్లు

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దేశ రాజధాని ఢిల్లీలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నగరం చరిత్రలోనే అత్యధికంగా ఒకేసారి 500 కిలోల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2 వేల కోట్లకు పైగానే ఉంటుందని పోలీసు లు తెలిపారు.

దక్షిణ ఢిల్లీలో భారీ డ్రగ్స్ దందా నడుస్తున్నదన్న పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులకు పెద్దపెద్ద బస్తాల్లో నిలువ ఉంచిన 500 కిలోల కొకైన్ లభ్యమైంది. దీనిని స్మగ్లిం గ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసు లు అరెస్టు చేశారు. ఇంత భారీ మొత్తం లో కొకైన్‌ను ఎక్కడి నుంచి తెచ్చారన్నదానిపై దర్యాప్తు జరుపుతున్నారు.