హైదరాబాద్,(విజయక్రాంతి): రాజ్ పాకాల పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దీంతో రాజ్ పాకాలను పోలీసుల ముందు హాజరై, సమాధానం ఇవ్వడానికి హైకోర్టు రెండు రోజుల సమయం ఇచ్చింది. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా రాజ్ పాకల లాయర్ మాట్లాడుతూ... రాజ్ పాకాల ఇంట్లో పార్టీ చేసుకుంటే పోలీసులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారని ఆరోపించారు. ఉద్యోగికి డ్రగ్ పాజిటివ్ వస్తే రాజ్ పాకాలను నిందితుడిగా చేర్చారని, అలాగే డ్రగ్స్ పరీక్షకు నమూనాలు ఇవ్వాలని మహిళలను ఇబ్బందులకు గురి చేశారని మయూర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిదినే లక్ష్యంగా చేసుకొని, అధికారం మదంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్ధేశ్యంతోనే కేసులు పెట్టుందని విరుచుకుపడ్డారు. మోకిల పోలీసులు రాజ్ పాకాలకు సోమవారం ఉదయం 9.30 నోటీసు ఇచ్చి 11 గంటలకు విచారణకు రమ్మన్నారని మయూర్ రెడ్డి పేర్కొన్నారు.