హైదరాబాద్: నటుడు అక్కినేని నాగార్జున పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. న్యాయమూర్తికి సెలవు ఉండటంతో కోర్టు విచారణను వాయిదా వేశారు. సోమవారం పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారించనుంది. నాగార్జున మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. బాపూఘాట్, లంగర్ హౌజ్లో గాంధీ జయంతి కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మీడియా ఇంటరాక్షన్లో మంత్రి చేసిన వ్యాఖ్యలు తన కుటుంబం ప్రతిష్టను దిగజార్చాయని నాగార్జున పిటిషన్లో పేర్కొన్నారు. నాగ చైతన్య, సమంత వివాహం చేసుకున్న 4 సంవత్సరాల తర్వాత 2021లో విడిపోయారు. విడిపోవడానికి గల కారణాన్ని గోప్యంగా ఉంచాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.మంత్రి కొండా సురేఖ మీడియాకు ఇచ్చిన ప్రకటనలో, కేటీఆర్ వల్ల సమంత మాత్రమే కాదు, మరికొందరు నటీనటులు తొందరగా పెళ్లి చేసుకున్నారని ఆరోపించారు.