calender_icon.png 14 October, 2024 | 4:37 PM

కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా.. విచారణ వాయిదా

14-10-2024 02:20:46 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్ పై సోమవారం నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారించింది. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారని, దీంతో తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగిందని పిటిషన్ లో పేర్కొన్నారు.

కేటీఆర్ తరుపు న్యాయవాది 23 రకాల ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో ఈనెల 18న కేటీఆర్ తోపాటు మరో నలుగురు సాక్షుల స్టేట్ మెంట్లను కోర్టు రికార్డు చేస్తామని చెప్పింది. ఈ కేసులో కేటీఆర్, బాల్కసుమన్, దాసోజు శ్రవణ్ తోపాటు సాక్షులు సత్యవతి రాథోడ్, తల ఉమ స్టేట్ మెంట్లు రికార్డు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను నాంపల్లి పత్యేక కోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది.