18-02-2025 01:03:35 AM
రాజంపేట ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) : రాజంపేట మండలంలో కేజీబీవి బాలికల వసతి గృహంలో ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు రాజంపేట వైద్యాధికారి డాక్టర్ విజయ మహాలక్ష్మి తెలిపారు. ఈమె మాట్లాడుతూ 224 మంది బాలికల వైద్య పరీక్షలు నిర్వహించి 67 మంది విద్యార్థులకు మందులు అందజేశారు. అనంతరం ఆరోగ్యంపై అవగాహన కల్పించమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాణి హెడ్మాస్టర్, సూపర్వైజర్ మంజూర్, నాగలక్ష్మి ఏఎన్ఎం, సబిత ఎ ఎన్ ఎం పాల్గొన్నారు.