calender_icon.png 23 October, 2024 | 11:20 PM

ఆర్టీసీ బస్సు ఢీకొని హెడ్‌మాస్టర్ మృతి

06-07-2024 03:45:01 PM

సిద్దిపేట: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడు మృతిచెందిన విషాద సంఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. చేర్యాల, నర్సాయపల్లి గ్రామాల మధ్య పట్టణ శివారులో బైకుపు విధులకు వెళ్తున్న వ్యక్తిని వెనకనుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన చంద్రశేఖర్ కు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోమృతి చెందారు. మృతుడు డీఎన్టీ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.