calender_icon.png 26 October, 2024 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైనేజీలో పడి శవమై తేలాడు

08-08-2024 03:40:20 AM

భద్రాచలం, ఆగస్టు 7: భద్రాచలం పట్టణం చర్ల రోడ్డులో గల ప్రధాన డ్రైనేజీ కాలువలో గళ్లంతన ఓ వ్యక్తి శవమై తేలాడు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రం పామెడుకు చెందిన సున్నం సతీష్, అతని భార్య సునీత కొన్నేళ్లుగా భద్రాచలంలో రోడ్డు వెంట ప్లాస్టిక్ సామాన్లు ఏరుకొని జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం చర్ల రోడ్డులోని కేకే ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న డ్రైనేజీలో ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకొంటున్న క్రమంలో సతీష్ కాలుజారి అందులోనే పడి గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న భార్య సునీత, స్థానికులు అతడిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ డ్రైనేజీ 8 అడుగల లోతు ఉండటంతో కుదరలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..  గ్రామపంచాయతీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు శవాన్ని వెలికితీశారు. భధ్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు దగ్గర ఉండి వెలికితీసే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.