కొంతకాలంగా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్కే పరిమితమయ్యారు. రుణమాఫీ, వరదలు, ట్రిపుల్ ఆర్, హైడ్రా లాంటి అంశాలపై ఆయన ఇప్పటివరకు కూడా కనీసం స్పందించ లేదు. సెప్టెంబర్17న తెలంగాణ భవన్లో జాతీయ జెం డా ఆవిష్కరణకు కూడా ఆయన ఫామ్హౌస్ను వీడలేని పరిస్థితి. ఇదే సమ యంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీశ్రావు అన్నట్లు సాగుతోంది. రేవంత్ రెడ్డి సభ లు, సమావేశాల్లో హరీశ్రావునే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. సీఎం విమర్శ లకు హరీశ్రావు కూడా సమాధానాలు చెప్పడం, తిరిగి కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఏంటనే దానిపై అనుమానం రాక మానదు. కేసీఆర్ కావాలనే తెలంగాణ రాజకీయ యవనిక నుంచి కొన్నాళ్లపాటు సైడ్ అయ్యారా? లేక వ్యూహాత్మకంగా సైడ్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది.