calender_icon.png 26 October, 2024 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో హర్వేస్టర్ హెల్పర్ మృతి

26-10-2024 01:24:42 AM

కామారెడ్డి, అక్టోబర్25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్‌లో శుక్రవారం వరిపంట కొయ్యడానికి హర్వే స్టర్ మిషన్‌పై హెల్పర్‌గా వెళ్తున్న యువరాజ్ (38) ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి మృతిచెందాడు. ఎల్లారెడ్డి పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటకకు చెందిన యువ రాజ్ శుక్రవారం ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్‌లో తౌర్యనాయక్ వరిపొలం కొయడానికి హార్వెస్టర్ హెల్ప ర్‌గా వెళ్లాడు. మిషన్‌పై వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు యువ రాజ్‌కు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు