calender_icon.png 21 October, 2024 | 9:24 AM

టీజేఏసీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా హర్షవర్దన్ రెడ్డి

21-10-2024 12:00:00 AM

*ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యచరణ సమితి తీర్మానం

హైదరాబాద్, అక్టోబర్ 20(విజయక్రాంతి): తమ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాల్‌రెడ్డి హర్షవర్దన్ రెడ్డిని ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యచరణ సమితి(టీజేఏసీ) ప్రకటించింది. ఆదివారం నాంపల్లిలోని టీఎన్‌జీఓ భవన్‌లో 33 ఉపాధాయ సంఘాలతో కూడిన టీజేఏసీ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టాలనే దానిపై చర్చించింది. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన హర్షవర్దన్ రెడ్డిని అభ్యర్థిగా  ఎంపిక చేస్తూ తీర్మానించారు.

హర్షవర్దన్ రెడ్డి గత 25ఏళ్లుగా ఉపాధ్యాయ, ఉద్యోగుల సంక్షేమ సంఘం, హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ 2015, 2016లో ఇందిరా పార్కు వద్ద దీక్షలు చేశారు. మహిళలకు చైల్డ్ కేర్ లీవులను మంజూరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ మణిపాల్ రెడ్డి, సెక్రటరీ జనరల్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.